దిల్‌సుఖ్‌న‌గ‌ర్ జంట పేలుళ్ల కేసు: ఉరిశిక్ష తీర్పును హైకోర్టులో అప్పీలు చేసుకున్న దోషులు

మూడున్న‌రేళ్ల క్రితం హైద‌రాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో జ‌రిగిన‌ జంటపేలుళ్ల కేసులో ఎన్ఐఏ కోర్టు ఇటీవ‌లే నేర‌స్తుల‌కి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో దోషులకు ఉరిశిక్షను ధ్రువీకరించేందుకు త‌మ తీర్పును ఎన్‌ఐఏ కోర్టు ఈ రోజు హైకోర్టుకు పంపింది. ఈ కేసును ప‌రిశీలించిన‌ హైకోర్టు రెఫర్‌ ట్రయల్‌ కేసును నమోదు చేసుకుంది. మ‌రోవైపు ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన ఉరిశిక్ష తీర్పును సవాల్‌ చేస్తూ దోషులు ఐదుగురు కూడా హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు. 
Go Back to Shorts
dilsukh nagar attacks
court

More Telugu News